Header Banner

రేపు దీపావళి, సంక్రాంతి కలిపి చేసుకుందాం మంత్రి.. ప్రజలందరూ పండుగ చేసుకోవాలని పిలుపు!

  Tue Jun 03, 2025 21:56        Politics

విజయవాడ విద్యాధరపురం సర్కిల్ లో షాప్ నెంబర్ 10, మరియు 15 చౌక దుకాణాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్  సౌరబ్ గౌర్ తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు. వైసీపీ ఐదేళ్లు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. సంక్షేమం పేరుతో అవినీతి చేశారు కనుకే ప్రజలు తిరస్కరించారన్నారు. రేపు (జూన్ 4) దీపావళి, సంక్రాంతి కలిపి పండగ చేసుకుందాం అని పిలుపునిచ్చారు. "గతేడాది జూన్ 4న రాక్షస పాలనకు ముగింపు పలికిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకోవాలి. ప్రతి ఇంటి వద్ద రంగులతో ముగ్గులు వేసి సంక్రాంతిలా ఆనందంగా జరుపుకోవాలి" అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుక జరిపారు. ఇవాళ తన పర్యటనలో, తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన మంత్రి నాదెండ్ల స్వయంగా రేషన్ సరుకులు అందజేశారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు.. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

 

ఇది కూడా చదవండి: జగన్ 2.0 వెర్షన్ మొదలైంది.. ఆయన్ను చూసి జాలిపడటం తప్ప.. ఇంకేమి చేయలేం!

 

అదేవిధంగా డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.. అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్ నందున రెండు షాపులను మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు. ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.డీలర్ల అందిస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇంటింటికీ సేవ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అన్నారు. ఎనీ టైం రేషన్ అదేవిధంగా  ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 తేదీల్లోపు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తీసుకున్న సౌకర్యం కల్పించామన్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటికి మూడు రోజుల్లో 62 లక్షల 14 వేల కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులను అందించమన్నారు. అంటే దాదాపు 42.14 శాతం మందికి మూడు రోజుల్లో సరుకులు అందజేసినట్టు తెలిపారు. అదేవిధంగా 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపు వారి ఇంటి వద్దకే సరుకులు అందజేస్తామని మాటిచ్చామని అన్నారు... అందులో భాగంగా మూడు రోజుల్లో ఆరు లక్షల మందికి వారి ఇంటి వద్దనే సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ లోపు మిగిలిన వృద్ధులు దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందజేస్తామని వివరించారు. రేషన్ షాప్‌లలో వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉన్న పాత విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాం అని గుర్తు చేశారు. రేషన్ సరఫరాలో పొరపాట్లకు తావులేకుండా సేవా భావంతో పని చేయాలని డీలర్లకు సూచించారు.

 

ఇది కూడా చదవండి: కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NadendlaManohar #AndhraPradesh #rationdistribution #YSRCP #government #Vijayawadapublic #distributionsystem #fair priceshopsrationcards #TeluguDesamParty #welfareschemes